BJP Dirty Politics | ఎన్నికలు వస్తున్నాయంటే మసి పూసి మారేడు చేసే బీజేపీ నాయకత్వం.. గుజరాత్లో కొత్త వేషానికి తెరలేపింది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో వెనకబడిపోతున్నట్లు వస్తున్న ఇంటెలిజెన్స్ నివేదికలతో బేజారెత్తుతున్న బీజేపీ నాయకత్వం.. మరో నాటకం ఆడేందుకు సిద్ధమైంది. మూడేండ్ల క్రితం పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) ను అమలుచేస్తామంటూ కల్లోలం రేపారు. ఇప్పుడేమో ఉమ్మడి పౌర స్మృతి (యూసీసీ) తెచ్చేందుకు మోదీ నాయకత్వంలోని గుజరాత్ ఝూటా పార్టీ ప్రభుత్వం ఏకంగా అమలు కమిటీనే నియమించింది.
గుజరాత్ అసెంబ్లీకి త్వరలో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ ఓటమి ఖాయమనే సిగ్నల్స్ ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి రావడంతో బీజేపీ నేతలకు మింగుడుపడటం లేదు. దాంతో హిందూ కార్డ్ను మళ్లీ పైకి తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా ఉమ్మడి పౌర స్మృతిపై బీజేపీ కన్నేసింది. అనుకున్నదే తడవుగా యూనిఫాం సివిల్ కోడ్ను అమలు చేసేందుకు గుజరాత్ బీజేపీ ప్రభుత్వం యూసీసీ అమలు కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. శనివారం జరిగిన రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో ఈ మేరకు కమిటీని ఏర్పాటుచేసే ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర హోం శాఖ సహాయ మంత్రి హర్ష్ సంఘ్వీ మీడియాకు వెల్లడించారు.
అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వచ్చే వారం ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. దాంతో శనివారం జరిగిన క్యాబినెట్ సమావేశం భూపేంద్రపటేల్ నేతృత్వంలోని మంత్రివర్గం చివరి సమావేశంగా పరిగణిస్తున్నారు. ప్రస్తుతం క్యాబినెట్ ఆమోదం తెలపిన యూసీసీ కమిటీకి హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి నేతృత్వం వహిస్తారని, ముగ్గురు లేదా నలుగురు సభ్యులు కమిటీలో ఉంటారని కేంద్ర మంత్రి పరోత్తమ్ రూపాలా తెలిపారు. ఇప్పటికే ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్లోని బీజేపీ ప్రభుత్వాలు తమ రాష్ట్రాల్లో యూసీసీని అమలు చేస్తున్నట్లు ప్రకటించాయి.