న్యూఢిల్లీ : ‘నీట్’ పేపర్ లీక్ వివాదం, నిరసనల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ఆందోళనకారులకు కొంత రాజకీయ పురోగతి కనిపించినప్పటికీ, తమ పిల్లలను కోల్పోయిన బాధిత కుటుంబాలకు ఇది ఏమాత్రం ఊరట నివ్వలేదు. మంత్రి రాజీనామా మా బిడ్డలను తిరిగి తెస్తుందా? అని వారు ప్రశ్నిస్తున్నారు. మధ్యప్రదేశ్కు చెందిన ఆకాంక్ష చతుర్వేది అనే విద్యార్థిని ‘నీట్’ పేపర్ లీక్ వివాదం తర్వాత మానసిక ఒత్తిడికి గురై, ఆత్మహత్య చేసుకుంది.
ఆమె చదువు కోసం తండ్రి భూమి అమ్మి అప్పుల పాలయ్యారు. ఆకాంక్ష మరణంతో ఆయన పక్షవాతం బారిన పడారని, పరిహారం అందించి దోషులను ఉరి తీయాలని ఆకాంక్ష తల్లి నీలిమ డిమాండ్ చేస్తున్నారు. ఇదే రాష్ర్టానికి చెందిన అవంతిక మౌర్య భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆమె తండ్రి నీటు రద్దు చేయాలన్నారు.