అహ్మదాబాద్: ప్రపంచ వ్యాప్తంగా మళ్లీ కరోనా వైరస్ కలకలం రేపుతున్నది. దీంతో దేశంలో థర్డ్ వేవ్ వచ్చే ముప్పు ఉన్నందున పలు రాష్ట్రాలు అప్రమత్తమవుతున్నాయి. ఇందులో భాగంగా టీకా తీసుకోని వారిపై ఆంక్షలు విధిస్తున్నాయి. తాజాగా గుజరాత్ ప్రభుత్వం గురువారం కీలక నిర్ణయం తీసుకున్నది.
నవంబర్ 12, అంటే శుక్రవారం నుంచి 18 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు, వ్యాక్సిన్కు అర్హులైనప్పటికీ మొదటి డోస్ లేదా రెండవ డోస్ తీసుకోని వారిని అహ్మదాబాద్లోని ఏటీఎంలు, బీఆర్డీఎస్, కంకారియా లేక్ఫ్రంట్, కంకారియా జూ, సబర్మతి రివర్ఫ్రంట్లోకి అనుమతించబోమని ప్రకటించింది.
లైబ్రరీ, జింఖానా, స్విమ్మింగ్ పూల్, ఏఎంసీ స్పోర్ట్స్ కాంప్లెక్స్, సిటీ సివిక్ సెంటర్, కార్పొరేషన్ అన్ని భవనాలలోకి ప్రవేశించే ముందు టీకా ధృవీకరణ పత్రాలను సిబ్బంది తనిఖీ చేస్తారని గుజరాత్ ప్రభుత్వం పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రజలు టీకాలు తీసుకోవాలని సూచించింది.