అహ్మదాబాద్: గుజరాత్కు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధుల వరద కొనసాగుతున్నది. కొత్తగా మరో రూ.12,600 కోట్లు గుజరాత్కు ఇవ్వనున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. గురువారం అహ్మదాబాద్ – ధొలెరా ఎక్స్ప్రెస్వే పనులను పరిశీలించిన అనంతరం ఆయన ఈ వివరాలు ప్రకటించారు.
మల్టీ మాడల్ లాజిస్టిక్ పార్కులు నిర్మాణానికి రూ.6 వేల కోట్లు, సేతు బంధన్ పథకంలో భాగంగా ఆర్యూబీలు, ఆర్వోబీల నిర్మాణానికి రూ.1,000 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. వార్షిక ప్రణాళికలో భాగంగా రూ.2,600 కోట్లు అదనంగా ఇస్తున్నట్లు చెప్పారు. దీనికి తోడు స్టేట్ హైవేలు, జిల్లా రోడ్లు, మున్సిపాలిటీల పరిధిలోని రోడ్ల అభివృద్ధికి రూ.3,000 కోట్లు ఇస్తామని చెప్పారు.