అహ్మదాబాద్: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి గుజరాత్లో షాక్ తగిలింది. ఆ పార్టీ ఎమ్మెల్యే భూపేంద్ర భయానీ శాసనసభ సభ్యత్వానికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. (Gujarat AAP MLA Bhupendra Bhayani ) జునాగఢ్ జిల్లాలోని విశావదర్ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న భూపేంద్ర భయానీ బుధవారం ఉదయం గాంధీనగర్లోని గుజరాత్ అసెంబ్లీకి వెళ్లారు. స్పీకర్ శంకర్ చౌదరికి రాజీనామా పత్రాన్ని అందజేశారు. అయితే రాజీనామాకు ఎలాంటి కారణాలను అందులో పేర్కోలేదు.
కాగా, రాజీనామా తర్వాత భూపేంద్ర భయానీ మీడియాతో మాట్లాడారు. ఎవరి ఒత్తిడి వల్ల ఎమ్మెల్యే పదవికి, ఆప్ సభ్యత్వానికి రాజీనామా చేయలేదని చెప్పారు. ‘నేను అభివృద్ధిని నమ్మి ప్రజలకు సేవ చేసే జాతీయవాదిని. నా ప్రాంత ప్రజలకు సేవ చేసేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ సరైన వేదిక కాదు. ఏ జాతీయవాది కూడా ఆప్లో ఎక్కువ కాలం ఉండలేడు’ అని అన్నారు. భారత్ను ప్రపంచ వ్యాప్తంగా గర్వించేలా చేసిన ప్రధాని నరేంద్ర మోడీని వ్యతిరేకించడం తనకు ఇష్టం లేదన్నారు. త్వరలో బీజేపీలో చేరుతానని ఆయన తెలిపారు. పార్టీ ఆదేశిస్తే ఉప ఎన్నికల్లో పోటీ చేస్తానని వెల్లడించారు.
#WATCH | Gujarat: Aam Aadmi Party leader Bhupat Bhayani resigned from the party, says, "I want to serve the public. Under PM Modi's leadership India has seen tremendous growth. I am influenced by our PM's work. I am a nationalist person. I am a person who believes in development.… pic.twitter.com/B6zN8Yh30I
— ANI (@ANI) December 13, 2023