న్యూఢిల్లీ : జీఎస్టీ వసూళ్లు భారీగా నమోదయ్యాయి. ఫిబ్రవరిలో రూ.1.33లక్షల కోట్లు వసూలయ్యాయని మంగళవారం ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. గతేడాది మార్చితో పోలిస్తే 18శాతం ఆదాయం పెరిగిందని పెరిగింది. ఫిబ్రవరి 2020తో పోలిస్తే 26శాతం వృద్ధి నమోదైంది. అయితే, జనవరితో గత నెలలో నమోదైన రూ.1.40 లక్షల కోట్లతో పోలిస్తే మాత్రం తగ్గుదల కనిపించింది. దీనికి కొవిడ్-19 ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తే కారణమని ఆర్థికశాఖ పేర్కొంది.
అలాగే ఫిబ్రవరిలో కేవలం 28 రోజులే ఉంటాయని, దీంతో జనవరితో పోలిస్తే వసూళ్లలో తగ్గుదల ఉంటుందని తెలిపింది. ఫిబ్రవరి మాసంలో నమోదైన రూ.1.33 లక్షల కోట్ల వసూళ్లలో కేంద్ర జీఎస్టీ (CGST) రూ.24,435 కోట్లు. రాష్ట్రాల జీఎస్టీ (SGST) రూ.30,779 కోట్లు. ఐజీఎస్టీ జీఎస్టీ (IGST) కింద రూ.67,471 కోట్లు (వస్తువుల దిగుమతులపై వసూలు చేసిన రూ.33,837 కోట్లతో కలిపి), సెస్ రూపంలో రూ.10,340 కోట్లు (వస్తువుల దిగుమతులపై వసూలు చేసిన రూ.638 కోట్లతో కలిపి) వసూలైనట్లు ఆర్థికశాఖ వివరించింది.