న్యూఢిల్లీ, ఆగస్టు 16: ఇకపై ఎవరైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందాలంటే ఆధార్ నంబర్ తప్పనిసరిగా ఉండాలని యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) ప్రకటించింది. ఆధార్ లేనివాళ్లు వెంటనే ఆధార్ కార్డుకోసం దరఖాస్తు చేసుకొని ఎన్రోల్మెంట్ స్లిప్ అయినా చూపించాల్సి ఉంటుందని పేర్కొన్నది.
ఈ మేరకు ఈ నెల 11వ తేదీనే అన్ని కేంద్రప్రభుత్వ మంత్రిత్వ శాఖలకు సర్క్యులర్ జారీచేసింది. దేశంలో 99 శాతం మంది వయోజనులకు ఆధార్ కార్డుల జారీ పూర్తయిందని, అందువల్ల ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందాలంటే ఆధార్ తప్పనిసరి చేస్తున్నట్టు పేర్కొన్నది.