న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: అంత్యోదయ అన్న యోజన (ఏఏవై) కింద దేశంలోని 1.89 కోట్ల కుటుంబాలకు రేషన్ షాపుల ద్వారా అందిస్తున్న సబ్సిడీ చక్కెర పథకాన్ని మరో రెండేళ్ల పాటు పొడిగించారు. ఈ పథకాన్ని 2026, మార్చి 31 వరకు పొడిగిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో సమావేశమైన కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.
ఏఏవై లబ్ధిదారులకు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రతి నెలా కేజీ చొప్పున ఈ సబ్సిడీ చక్కెరను అందిస్తున్నారు. ఈ చక్కెరపై కిలోకు రూ.18.50 వంతున కేంద్రం సబ్సిడీ ఇస్తున్నది. అయితే ఈ చక్కెర సేకరణ, పంపిణీ బాధ్యతలను మాత్రం ఆయా రాష్ర్టాలు చూస్తున్నాయి.