Nirmala Sitharaman | న్యూఢిల్లీ: కనిపించిన ప్రతీదాన్నీ ప్రభుత్వమేమీ అమ్మబోదని.. నాలుగు వ్యూహాత్మక రంగాల్లో సర్కారీ సంస్థలు కొనసాగుతాయని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ, పలు కంపెనీలను పూర్తిగా అమ్మేసే దిశగా మోదీ సర్కారు పరుగులు పెడుతున్న నేపథ్యంలో మంత్రి పైవిధంగా స్పష్టతనిచ్చారు.
అటామిక్ ఎనర్జీ, స్పేస్ అండ్ డిఫెన్స్.. ట్రాన్స్పోర్ట్ అండ్ టెలీకమ్యూనికేషన్.. పవర్, పెట్రోలియం, కోల్, ఇతర ఖనిజాలు.. బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, ఆర్థిక సేవలు ఈ నాలుగు రంగాల్లో ప్రభుత్వ సంస్థల కార్యకలాపాలుంటాయని మంత్రి సీతారామన్ తెలియజేశారు.