ముంబై : రూ. 1000 కోట్ల ఆన్లైన్ పోంజి స్కామ్లో బాలీవుడ్ నటుడు గోవిందను ఒడిషా ఆర్ధిక నేరాల విభాగం (ఈఓడబ్ల్యూ) ప్రశ్నించనుంది. క్రిప్టో ఇన్వెస్ట్మెంట్ పేరుతో సోలార్ టెక్నో అలయన్స్ (ఎస్టీఏ-టోకెన్) పలు దేశాల్లో అక్రమ లావాదేవీలతో భారీ కుంభకోణానికి తెరలేపిందని అధికారులు పేర్కొన్నారు. ఆన్లైన్ పోంజీ స్కామ్లో తెరపైకి వచ్చిన బాలీవుడ్ నటుడు గోవిందను ఈఓడబ్ల్యూ ప్రశ్నించనుంది.
ప్రమోషనల్ వీడియోల్లో కంపెనీ కార్యకలాపాలను గోవింద ప్రమోట్ చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. జులైలో గోవాలో జరిగిన ఎస్టీఏ వేడుకల్లో పాల్గొనడంతో పాటు కొన్ని వీడియోల్లో కంపెనీని ప్రమోట్ చేసిన గోవిందను ప్రశ్నించేందుకు తాము త్వరలో ముంబైకి ఓ బృందాన్ని పంపుతామని ఈఓడబ్ల్యూ ఇన్స్పెక్టర్ జనరల్ జేఎన్ పంకజ్ తెలిపారు.
ఈ స్కామ్లో ప్రస్తుతం గోవింద నిందితుడు కానీ, అనుమానితుడు కాదని దర్యాప్తు అనంతరమే ఆయన పాత్ర ఏంటో బయటపడుతుందని అన్నారు. గోవింద పాత్ర కేవలం ప్రోడక్ట్ ఎండార్స్మెంట్కే పరిమితమైతే ఈ కేసులో తాము ఆయనను సాక్షిగా చేరుస్తామని చెప్పారు. ఈ కంపెనీ భద్రక్, కియోంజహర్, బాలాసోర్, మయూర్భంజ్, భువనేశ్వర్లో దాదాపు 10,000 మంది నుంచి రూ. 30 కోట్లు వసూలు చేసిందని అధికారులు వెల్లడించారు.
Read More :