తిరువనంతపురం, ఆగస్టు 17: కేరళలో గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్, పినరయ్ విజయన్ ప్రభుత్వం మధ్య కోల్డ్వార్ మరింత పెరిగింది. చాలాకాలంగా ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టే నిర్ణయాలు తీసుకొంటున్న గవర్నర్, తాజాగా ప్రభుత్వం ప్రతిపాదించిన న్యాయ చట్టాల సవరణపై కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
మంగళవారం సమావేశమైన మంత్రివర్గం రాష్ట్రంలో యూనివర్సిటీలకు వీసీల నియామకంపై గవర్నర్కు ఉన్న అధికారాలను రద్దుచేసేలా చట్ట సవరణ చేయాలని నిర్ణయించింది. దీనిపై బుధవారం స్పందించిన గవర్నర్ అలాంటి చట్ట సవరణలు మళ్లీ గవర్నర్ ఆమోదానికే రావాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. గతంలో ప్రభుత్వం రూపొందించిన 10 ఆర్డినెన్స్లను జారీచేసేందుకు గవర్నర్ తిరస్కరించారు. దీంతో రాజ్భవన్కు, ప్రభుత్వానికి అగాథం పెరిగిపోయింది.