న్యూఢిల్లీ : రెండు ప్రతిష్టాత్మక విద్యా సంస్ధలు ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ మద్రాస్ విదేశీ క్యాంపస్లు ఏర్పాటు చేయనున్నాయి. భారత విద్యా సంస్ధల నైపుణ్యాలను దేశ సరిహద్దుల వెలుపల విస్తరించే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఐఐటీ ఢిల్లీ అబుదాబిలో క్యాంపస్ను ప్రారంభిస్తుండగా, ఐఐటీ మద్రాస్ ఆఫ్రికా దేశాల్లో విద్యావసరాలకు అనుగునంగా జంజిబర్లో క్యాంపస్ను ఏర్పాటు చేసింది.
భారత విద్యా రంగ అంతర్జాతీయీకరణకు ఈ చర్యలు దోహదపడతాయని విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhan) బుధవారం రాజ్యసభలో పేర్కొన్నారు. ఇవాళ మన విద్యార్ధులు బయట దేశాలకు వెళుతున్నారు. విదేశీ విద్యా సంస్ధలూ భారత్కు వస్తున్నాయి, రెండు విదేశీ సంస్ధలు గుజరాత్, గిఫ్ట్ సిటీలో తమ యూనివర్సిటీలను ప్రారంభించేందుకు కసరత్తు సాగిస్తున్నాయని చెప్పారు.
భారత్లో విదేశీ విద్యా సంస్ధలు క్యాంపస్లు ప్రారంభించేందుకు ఆసక్తి చూపుతున్నాయని పేర్కొన్నారు. విద్యార్ధుల అవసరాలకు అనుగుణంగా ప్రపంచస్ధాయి ప్రమాణాలతో కూడిన విద్యా బోధన, ఫీజుల వ్యవస్ధ దిశగా జాతీయ విద్యా విధానానికి లోబడి నియంత్రణ యంత్రాంగంపై దృష్టి సారించామని తెలిపారు.
Read More :
UGC NET | నేటి నుంచి యూజీసీ నెట్ పరీక్షలు.. అడ్మిట్ కార్డులను ఇలా డౌన్లోడ్ చేసుకోండి