Messenger Apps | దేశ భద్రతను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం 14 మొబైల్ మెసెంజర్ యాప్లను బ్లాక్ చేసింది. ఆయా యాప్లు తీవ్రవాద కార్యకలాపాలకు వినియోగిస్తున్నారని, ఉగ్రవాదులు ఈ మొబైల్ మెసెంజర్ యాప్లను వినియోగిస్తున్నట్లుగా పేర్కొంది. ఈ యాప్ల ద్వారా ఉగ్రవాదులకు పాక్ నుంచి సందేశాలు వచ్చేయని పేర్కొంది. నిషేధించిన యాప్లలో క్రిప్వైజర్, ఎనిగ్మా, సేఫ్స్విస్, విక్ఆర్ఎంఈ, మీడియఫైర్, బ్రియర్, బీచాట్, నాండ్బాక్స్, కొనియన్, ఐఎంవో, ఎలిమెంట్, సెకండ్ లైన్, జంగి, త్రీమా యాప్లను నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నది.
సమాచారం ప్రకారం.. ఉగ్రవాదులు జమ్మూకశ్మీర్లోని తమ సహచరులకు సందేశాలు పంపేందుకు ఈ యాప్లను వినియోగిస్తున్నారని కేంద్రం గుర్తించింది. పలు పరిశోధనా సంస్థలు సైతం ఈ విషయాన్ని ధ్రువీకరించాయి. ఈ క్రమంలో కేంద్రం యాప్లపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకున్నది. ఈ యాప్లను కాశ్మీర్లోని ఉగ్రవాదులు తమ మద్దతుదారులు, కిందిస్థాయి వారికి సందేశాలు పంపడంతో పాటు చాటింగ్ కోసం వినియోగిస్తున్నట్లుగా భద్రతా సంస్థలు గుర్తించాయి. అయితే, ఆయా యాప్ డెవలపర్లు భారత్ లేరని, దేశం నుంచి ఆపరేట్ చేయడం లేదని తెలుస్తుంది.
అయితే, భారతీయ చట్టాల ప్రకారం.. సమాచారం కోసం యాప్ కంపెనీలను సంప్రదించడం సైతం సాధ్యం కాదని, ట్రాక్ చేయలేని విధంగా రూపొందించినట్లు, డెవలపర్లను గుర్తించడం కూడమే కష్టమేనని అధికార వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలో యాప్లపై బ్యాన్ విధించినట్లు వెల్లడించాయి. ఇదిలా ఉండగా.. ఇప్పటికే దేశ భద్రతను దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే పలు యాప్లపై కేంద్రం ఉక్కుపాద మోపిన విషయం తెలిసిందే. చైనాకు చెందిన 250 వరకు యాప్లపై నిషేధం విధించిన విషయం తెలిసిందే.