వరంగల్ రూరల్ : నల్లబెల్లి మండలం నారక్కపేట గ్రామంలో ఐకేపీ ద్వారా నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని క్షేత్రస్థాయిలో నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పరిశీలించారు. కొనుగోలు కేంద్రం వద్ద నెలకొన్న ట్రాన్స్ పోర్ట్ వంటి పలు సమస్యలపై ఆరా తీశారు. రైతులు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. సమస్యలు పరిష్కరిస్తామని రైతులకు భరోసానిచ్చారు. కార్యక్రమంలో స్థానిక ఎంపీటీసీ, సర్పంచ్, అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
కరోనాకు మనో ధైర్యమే మందు : ఎమ్మెల్యే చల్లా
ధాన్యం నిల్వల కోసం ప్రభుత్వ భవనాలను వినియోగించండి
ఆన్లైన్ బ్యాంకింగ్లో ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
కాశయ్య మృతి పట్ల మంత్రి పువ్వాడ సంతాపం