Odisha | భువనేశ్వర్ : ఒడిశాలో మూడు రైళ్లు ఢీకొన్న ఘటన మరువక ముందే మరో ఘోరం జరిగింది. బార్గఢ్ జిల్లాలో ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. గూడ్స్ రైల్లోని ఐదు బోగీలు పక్కకు ఒరిగాయి. అయితే ఈ రైలు ప్రమాదానికి రైల్వే శాఖకు ఎలాంటి సంబంధం లేదని ఈస్ట్ కోస్ట్ రైల్వే ప్రకటించింది. ప్రయివేటు సిమెంట్ పరిశ్రమలో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు నిర్ధారించారు. డుంగ్రి లైమ్ స్టోన్ గనులు, ఏసీసీ ప్లాంట్కు మధ్య ఏర్పాటు చేసిన ప్రయివేటు న్యారో గేజ్ రైల్ లైన్లో సున్నపురాయిని తరలిస్తున్న గూడ్స్ రైలు పట్టాలు తప్పినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ గూడ్స్ రైలు నడిపే లోకో పైలట్లు కూడా ప్రయివేటుకు సంబంధించిన వారేనని స్పష్టం చేశారు.
మూడు రోజుల క్రితం జరిగిన కోరమండల్, బెంగళూరు – హౌరా ఎక్స్ప్రెస్, గూడ్స్ రైలు ఢీకొన్న ఘటనలో 275 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. 900 మందికి పైగా క్షతగాత్రులు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మొన్న జరిగిన ప్రమాదానికి 500 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది.
#WATCH | Some wagons of a goods train operated by a private cement factory derailed inside the factory premises near Mendhapali of Bargarh district in Odisha. There is no role of Railways in this matter: East Coast Railway pic.twitter.com/x6pJ3H9DRC
— ANI (@ANI) June 5, 2023