Yogi Adityanath | త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వోద్యోగులకు సీఎం యోగి ఆదిత్యనాథ్ తీపి కబురందించనున్నారు. కేంద్ర ప్రభుత్వోద్యోగులకు జూలై ఒకటో నుంచి మూడు శాతం కరువు భత్యం (డీఏ) పెంచినట్లే.. వచ్చే ఏడాది ప్రారంభంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో త్వరలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంచనున్నారని సమాచారం.
ఈ మేరకు సీఎం యోగి ఆదిత్యనాథ్ త్వరలో నిర్ణయం తీసుకోనున్నారని వినికిడి. అదే జరిగితే 16 లక్షల మంది యూపీ రాష్ట్ర ప్రభుత్వోద్యోగులకు లబ్ధి చేకూరనున్నది. దీపావళి పండుగ సందర్భంగా బోనస్ కూడా ఇస్తారని సమాచారం.ప్రస్తుతం యూపీ రాష్ట్ర ప్రభుత్వోద్యోగులకు కనీస వేతనంపై 28 శాతం డీఏ చెల్లిస్తున్నారు.
కేంద్ర ఉద్యోగుల మాదిరిగా మూడు శాతం డీఏ పెరిగితే.. అది 31 శాతానికి చేరుతుంది. దీనిపై కేంద్ర ప్రభుత్వ ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నట్లు తెలియవచ్చింది. అధికార వర్గాల కథనం ప్రకారం నాన్గెజిటెడ్ ఉద్యోగులు, డైలీవేజ్ కార్మికులు, వర్క్ చార్జ్డ్ ఉద్యోగులకు బోనస్ ఇవ్వడానికి ఆర్థిక శాఖ నివేదిక సిద్ధం చేసిందని సమాచారం. ఈ నివేదికపై సీఎం యోగి ఆదిత్యనాథ్ సంతకం కోసం అధికారులు వేచి చూస్తున్నారని తెలుస్తోంది.
ఒకటి, రెండురోజుల్లో డీఏ, బోనస్పై యోగి సర్కార్ ప్రకటన చేయనున్నది. పెరిగిన డీఏను జూలై-సెప్టెంబర్ నెలల మొత్తం ఉద్యోగుల పీఎఫ్ ఖాతాలో జమ చేస్తారు. పెన్షనర్లకు కూడా డీఏ పెంచుతారని అంచనా వేస్తున్నారు.
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
United Nations : చరిత్రలో ఈరోజు : ఐక్యరాజ్య సమితికి 76 ఏండ్లు
Honeytrap : హనీట్రాప్లో ఆర్మీ జవాన్.. రహస్యపత్రాలు పంపుతుండగా పట్టివేత
Congress New Rules : కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం కావాలా? అయితే, ఈ నిబంధనలు పాటించాల్సిందే!
జమ్ముకశ్మీర్లో తాలిబాన్ ప్రభావం కనిపిస్తోంది : సీడీఎస్ బిపిన్ రావత్ హెచ్చరిక
10 దేశాల రాయబారులను బహిష్కరించిన టర్కీ