Gold Smuggling | చెన్నై : తమిళనాడులో భారీగా అక్రమ బంగారం పట్టుబడింది. రూ. 20 కోట్ల విలువ చేసే 32.7 కిలోల అక్రమ బంగారాన్ని డీఆర్ఐ, భారత తీరగస్తీ దళం అధికారులు పట్టుకున్నారు. గల్ఫ్ ఆఫ్ మన్నార్ వద్ద అక్రమ బంగారాన్ని పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. శ్రీలంక మీదుగా భారత్కు అక్రమ బంగారం తరలిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. జాలర్ల బోట్లలో స్మగ్లర్లు భారీగా బంగారం తరలిస్తున్నట్లు పక్కా సమాచారం అందడంతో తనిఖీలు నిర్వహించి, స్వాధీనం చేసుకున్నట్లు స్పష్టం చేశారు.