న్యూఢిల్లీ: ఢిల్లీలో ఇవాళ బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. ఢిల్లీ బులియన్ మార్కెట్లో బుధవారం 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర కేవలం రూ.23 పెరిగి రూ.47,024కు చేరింది. క్రితం ట్రేడ్లో తులం స్వచ్ఛమైన బంగారం ధర రూ.47,001గా ఉన్నది. అయితే వెండి ధర ఢిల్లీలో స్వల్పంగా తగ్గింది. ఢిల్లీ మార్కెట్లో కిలో వెండి ధర రూ.399 తగ్గి రూ.67,663కు చేరింది. క్రితం ట్రేడ్లో కిలో వెండి ధర రూ.68,062 వద్ద ముగిసింది. ఇక అంతర్జాతీయ మార్కెట్లలో ఔన్స్ బంగారం ధర 1,812 అమెరికన్ డాలర్లు, ఔన్స్ వెండి ధర 26.02 అమెరికన్ డాలర్లు పలికింది.