పనాజీ: రాత్రి వేళ కారు నుంచి దిగిన కాంగ్రెస్ నేతను పాము కాటు వేసింది. ఆయనను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఇటీవల రద్దైన అసెంబ్లీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ తరుఫున ప్రధాన అభ్యర్థిగా పోటీలో ఉన్న ఆయన మృతి పట్ల ఆ పార్టీ తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. (Congress Leader Dies Of Snakebite) గోవాకు చెందిన కాంగ్రెస్ పార్టీ నేత 38 ఏళ్ల కేతన్ భటికర్, గురువారం రాత్రి కర్ణాటకలోని దండేలి గ్రామానికి కారులో బయలుదేరారు.
కాగా, గోవా-కర్ణాటక సరిహద్దులోని కర్మాళ్ ఘాట్ వద్ద కేతన్ తన కారు నుంచి కిందకు దిగారు. ఒక పాము ఆయనను కాటు వేసింది. కేతన్ను వెంటనే గోవాలోని ధర్బందోరాలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. పరిశీలించిన వైద్యులు ఆయన అప్పటికే మరణించినట్లు నిర్ధారించారు.
మరోవైపు పోండా సిట్టింగ్ బీజేపీ ఎమ్మెల్యే రవి నాయక్ 2025 అక్టోబర్ 15న మరణించడంతో ఏప్రిల్ 9న ఉప ఎన్నిక జరుగాల్సి ఉన్నది. కాంగ్రెస్ అభ్యర్థిగా కేతన్ భటికర్ పోటీలో ఉన్నారు. అయితే శాసనసభ పదవీకాలం ఏడాది లోపే ముగియనున్నందున ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని ఉల్లంఘించారనే కారణంతో ఉప ఎన్నిక కోసం ఈసీ జారి చేసిన నోటిఫికేషన్ను బాంబే హైకోర్టు గోవా బెంచ్ ఏప్రిల్ 8న రద్దు చేసింది. దీంతో పోండాలో జరుగాల్సిన ఉప ఎన్నిక నిలిచిపోయింది.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్న కేతన్ భటికర్, హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఆయన దాఖలు చేసిన ప్రత్యేక అనుమతి పిటిషన్ ప్రస్తుతం పెండింగ్లో ఉన్నది. ఈ తరుణంలో పాటు కాటు వల్ల కేతన్ భటికర్ మరణించడంపై గోవా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది.