న్యూఢిల్లీ: తీవ్ర ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న గోఫస్ట్(Go First) విమాన సంస్థ వచ్చే మంగళవారం వరకు అన్ని విమానాలను రద్దు చేసింది. అయితే విమానాల రద్దుతో నష్టపోయిన ప్రయాణికులకు.. రిఫండ్ చెల్లించాలంటూ విమాన సంస్థకు డీజీసీఏ తన ఆదేశాల్లో స్పష్టం చేసింది. గోఫస్ట్ను గతంలో గోఎయిర్ అని పిలిచేవారు. బుధవారం నుంచి ఆ సంస్థ ఆపరేషన్స్ అర్థాంతరంగా నిలిచిపోయాయి. దివాళా తీసిన ట్లు ప్రకటించడంతో.. అనేక మంది ప్రయాణికులు ఎక్కడిక్కడ స్తంభించిపోయారు.
ప్రాట్ అండ్ విట్నీకి చెందిన విమాన ఇంజిన్లు నాసిరకంగా ఉన్నట్లు గోఫస్ట్ ఆరోపించింది. ఆపరేషనల్ ఇష్యూస్ వల్ల విమానాలను రద్దు చేయాల్సి వచ్చిందని ఎయిర్లైన్ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. చెన్నై, ముంబైలోని గోఫస్ట్ కౌంటర్లు వెలవెలబోతూ కనిపించాయి. టికెట్లు రద్దు అయినట్లు తమ కస్టమర్లకు ముందుగానే చెప్పినట్లు గోఫస్ట్ వెల్లడించింది.