ప్రపంచంలో ఏటా 17 శాతం ఆహారం వృథా
దేశంలో ప్రతి ఇంటిలో ఏడాదికి 50 కిలోలు
వృథాలో తొలిరెండు స్థానాల్లో చైనా, భారత్
యూఎన్ఈపీ నివేదిక-2021లో వెల్లడి
హైదరాబాద్, మే 2 (నమస్తే తెలంగాణ): ప్రతిరోజూ మనం భుజిస్తున్న ప్రతి ఆరు ముద్దల్లో ఒక ముద్ద చెత్తకుప్పల్లో చేరుతున్నదంటే ఆశ్చర్యపోకండి. ప్రపంచవ్యాప్తంగా ఏటా 17% ఆహారం వృథా అవుతున్నట్టు ‘ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం’ (యూఎన్ఈపీ) ఆహార వృథా సూచిక-2021 ఆందోళన వ్యక్తం చేసింది. 2020లో 931 మిలియన్ టన్నుల (93.10 కోట్ల టన్నులు) ఆహారం వృథా అయినట్టు లెక్క గట్టింది. ఇది భారతదేశంలో ఉత్పత్తయిన ఆహారధాన్యాలు, నూనెగింజలు, చెరకు, ఉద్యానవన ఉత్పత్తులతో సమానమని విశ్లేషించింది. అత్యధికంగా ఆహారాన్ని వృథా చేస్తున్న దేశాల్లో చైనా, భారత్ తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా 152 డాటా పాయింట్ల ఆధారంగా, 54 దేశాల్లో ఆహార వ్యర్థాల అంచనాలను గమనించి యూఎన్ఈపీ, బ్రిటన్కు చెందిన వ్రాప్ స్వచ్ఛంద సంస్థ సంయుక్తంగా ఇటీవల ఈ నివేదికను విడుదల చేశాయి.
ఫుడ్ వేస్టేజ్ ఇండెక్స్లో ముఖ్యాంశాలు