న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీని వీడిన గులాం నబీ ఆజాద్ విధేయులు మళ్లీ ఆ పార్టీలో చేరారు. జమ్ముకశ్మీర్లో కాంగ్రెస్కు ఇది ఊతమిస్తుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. జమ్ముకశ్మీర్ మాజీ ఉప ముఖ్యమంత్రి తారా చంద్ శుక్రవారం తిరిగి సొంత గూటికి వచ్చారు. ఆయనతోపాటు మాజీ మంత్రి పీర్జాదా మొహమ్మద్ సయీద్, ముజఫర్ పర్రే, బల్వాన్ సింగ్ తదితరులు కాంగ్రెస్ పార్టీలో తిరిగి చేరారు. చాంద్, బల్వాన్ సింగ్లు గులాం నబీ ఆజాద్కు విధేయులు. కాంగ్రెస్ను వీడిన ఈ నేతలు గులాం నబీ ఆజాద్ నెలకొల్పిన డెమోక్రటిక్ ఆజాద్ పార్టీ (డీఏపీ) లో చేరారు.
కాగా, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు కొందరు నేతలను ఆజాద్ గత నెలలో డీఏపీ నుంచి బహిష్కరించారు.ఈ నేపథ్యంలో వారంతా తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు. శుక్రవారం ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు కేజీ వేణుగోపాల్, జైరాం రమేశ్, ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జ్ రజనీ పాటిల్ సమక్షంలో వారంతా తిరిగి సొంత గూటికి వచ్చారు.
మరోవైపు, కాంగ్రెస్కు ఇది గొప్ప రోజు అని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు. రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’ జమ్ముకశ్మీర్లోకి ప్రవేశించక ముందే గులాం నబీ ఆజాద్ విధేయులు తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరడం పార్టీకి ఊతమిచ్చే చర్య అని అన్నారు. కాగా, కాంగ్రెస్ను వీడిన గులాం నబీ ఆజాద్ కూడా సొంత గూటికి తిరిగి వస్తారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
LIVE: Congress party briefing along with Shri @Jairam_Ramesh, Smt @rajanipatil_in and Shri @Pawankhera at AICC HQ.https://t.co/3iBiZ2vvLv
— K C Venugopal (@kcvenugopalmp) January 6, 2023