Dog Bite | లక్నో : ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో విషాదం నెలకొంది. తనను కుక్క కరిచిన విషయాన్ని ఓ బాలుడు తన పేరెంట్స్కు చెప్పలేదు. నెల రోజుల తర్వాత ఆ బాలుడు రేబిస్ వ్యాధితో చనిపోయాడు.
వివరాల్లోకి వెళ్తే.. ఘజియాబాద్లోని చరణ్ సింగ్ కాలనీకి చెందిన షావాజ్(14) ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. నెల రోజుల క్రితం పొరుగింట్లో ఉన్న ఓ కుక్క షావాజ్ను కరిచింది. భయంతో ఈ విషయాన్ని అతను తన తల్లిదండ్రులకు చెప్పలేదు. ఇక సెప్టెంబర్ 1వ తేదీ నుంచి బాలుడి అనారోగ్యానికి గురయ్యాడు. ఆహారం తినడం మానేశాడు. విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు. దీంతో షావాజ్ను కుటుంబ సభ్యులు ప్రశ్నించగా, తనను నెల రోజుల క్రితం ఓ కుక్క కరిచిందని తెలిపాడు.
ఇక తీవ్ర అస్వస్థతకు గురైన షావాజ్ను ఢిల్లీలోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా, చికిత్స చేసేందుకు నిరాకరించారు. దీంతో బులంద్షర్లోని ఓ ఆయుర్వేదిక్ డాక్టర్ వద్దకు తీసుకెళ్లారు. సోమవారం సాయంత్రం బులంద్షర్ నుంచి ఘజియాబాద్కు అంబులెన్స్లో తీసుకెళ్తుండగా షావాజ్ ప్రాణాలు కోల్పోయాడు. బాలుడి మృతికి కారణమైన కుక్కతో పాటు దాని యజమానిపై చర్యలు తీసుకోవాలని షావాజ్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.