Gautam Adani : అయోధ్యలో అపూర్వ ఘట్టం ఆవిష్కృతమైంది. నూతనంగా నిర్మించిన రామాలయంలో బాలరాముడు కొలువు తీరాడు. శ్రీరాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట వేడుక అత్యంత వైభవంగా జరిగింది. వేద మంత్రోచ్ఛారణలు, జై శ్రీరాం నినాదాలు హోరెత్తుతుండగా ఈ క్రతువు ముగిసింది. ఆపై వేలాది అతిధుల నడుమ మహా హారతి కార్యక్రమం చేపట్టారు.
ఇక రామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా పారిశ్రామిక దిగ్గజం, అదానీ గ్రూప్ చైర్మన్ గౌతం అదానీ స్పందించారు. అయోధ్య రామాలయ తలుపులు తెరుచుకుంటున్న ఈ అద్భుత ఘడియల్లో ఈ మందిరం శోభాయమానంగా విలసిల్లుతూ శాంతి, సౌభ్రాతృత్వాలు వెల్లివిరిసే కేంద్రంగా వర్ధిల్లాలని అదానీ పేర్కొన్నారు. దేశ ఆథ్యాత్మిక, సాంస్కృతిక సామరస్యాలకు ప్రతీకగా అన్ని వర్గాలను కలిపిఉంచుతుందని ఎక్స్ వేదికగా అదానీ పోస్ట్ చేశారు.
శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట వేడుకలకు ప్రధాని నరేంద్ర మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యానాధ్, ఆరెస్సెస్ చీప్ మోహన్ భాగవత్ బాలీవుడ్ ఐకాన్ అమితాబ్ బచ్చన్, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సహా పలువురు ప్రముఖులు తరలివచ్చారు.
Read More :
Bhadradri | రామమందిరం ప్రాణప్రతిష్ఠ.. భద్రాచలంలో అట్టహాసంగా రథోత్సవం