Kapil Sibal | న్యూఢిల్లీ, ఆగస్టు 30: ఎన్నికలకు ముందు వంట గ్యాస్ ధరను రూ.200 తగ్గిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై కేంద్ర మాజీ మంత్రి కపిల్ సిబల్ స్పందించారు. ఇది రేవ్డీ సంస్కృతి కాకపోతే మరేమిటి? అని నిలదీశారు. రాజకీయ పార్టీలు ప్రజలకు ఉచిత హామీలు ఇచ్చే సంస్కృతి మంచిదికాదంటూ గతంలో ప్రధాని మోదీ పేర్కొన్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో సిబల్ స్పందిస్తూ ‘మీరు వంట గ్యాస్ ధరను తగ్గిస్తే అది పేదల కోసమేనని అంటారు. అదే ప్రతిపక్షాలు తగ్గిస్తామని చెప్పితే రేవ్డీ సంస్కృతి అంటారు. ఇదేం పద్ధతి?’ అని ప్రశ్నించారు.