హైదరాబాద్ : గంజాయి స్మగ్లింగ్కు సరికొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా ఆన్లైన్లో సేవల ద్వారా గంజాయి స్మగ్లింగ్కు పాల్పడుతున్నారు. అమెజాన్ ద్వారా ఆన్లైన్లో గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. విశాఖపట్టణం కేంద్రంగా మధ్యప్రదేశ్కు గంజాయిని సరఫరా చేసినట్లు నిర్ధారించారు. దీంతో మధ్యప్రదేశ్లోని బెండీలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కేసు విచారణ నిమిత్తం మధ్యప్రదేశ్ పోలీసులు.. ఇవాళ విశాఖకు చేరుకున్నారు. విశాఖ ఆన్లైన్ స్టోర్లోని ముగ్గురు ఉద్యోగులు కుమారస్వామి, కృష్ణంరాజు, వెంకటరమణను పోలీసులు అరెస్టు చేశారు. గంజాయి సరఫరా చేసే శ్రీనివాస్ను కూడా అదుపులోకి తీసుకున్నారు. కరివేపాకు పొడి, హెర్బల్ ప్రొడక్ట్స్ పేరుతో గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్నారు.