న్యూఢిల్లీ : ప్రపంచంలోనే అత్యధిక మంది సందర్శించే యాత్రస్థలం గంగ అని, ఇక్కడికి ఏటా రెండు కోట్ల మంది పర్యాటకులు వస్తుంటారని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్రెడ్డి అన్నారు. గంగానది కేవలం స్నానం చేయడానికి మాత్రమే కాదని.. పవిత్రమైన నది అని హిందూ ధర్మం బోధిస్తోందని, అందుకే దాన్ని శుభ్రపరచడం మన ప్రధాన బాధ్యత అన్నారు. గంగను పరిశుభ్రంగా ఉంచుకోవడాన్ని ప్రజలు ఆచారంగా మార్చుకోవాలని గంగా ఉత్సవ్లో పేర్కొన్నారు.
గంగ భారతదేశంలోని ప్రజల ‘ఆధాత్మిక జీవనాడి మాత్రమే కాదు.. ఆర్థిక జీవనాధారం’ అన్నారు. స్వచ్ఛంద సంస్థలు నదిని పరిశ్రుభంగా ఉంచడంలో తమవంతు పాత్ర పోషించాలన్నారు. జల్శక్తి సహాయ మంత్రి ప్రహ్లాద్ పటేల్ మాట్లాడుతూ గంగా ప్రక్షాళనకు సహకరిస్తున్న వారు రక్షకులన్నారు. నదులను కాలువలుగా చూడొద్దని, కాలువ మన కోరిక మేరకు ప్రవహిస్తుంది.. కానీ గంగా వంటి నదులు స్వతంత్రంగా ఉంటాయన్నారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రులు గంగపై పుస్తకం, మ్యూజిక్ వీడియోను విడుదల చేశారు. ‘గంగా కీ బాత్ – చాచా చౌదరి కే సాథ్’ అనే కామిక్ సిరిస్ను విడుదల చేశారు.