అయోధ్య: అయోధ్య(Ayodhya Ram Temple)లో ఇవాళ గణేశ, వరుణ పూజ నిర్వహిస్తున్నారు. ఈనెల 22వ తేదీన రామాలయాన్ని ఓపెన్ చేయనున్న విషయం తెలిసిందే. ప్రాణ ప్రతిష్టకు ముందు జరగాల్సిన వివిధ రకాల పూజలను పండితులు నిర్వహిస్తున్నారు. బుధవారం రాత్రే గర్భగుడిలోకి రాముడి విగ్రహాన్ని తీసుకువచ్చారని, అయితే ముందు రోజున కలశ పూజ నిర్వహించినట్లు ఓ పూజారి తెలిపారు. మంగళవారం నుంచే పూజా కార్యక్రమాలను ప్రారంభించామని శ్రీరామజన్మభూమి తీర్థక్షేత్ర జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ తెలిపారు.
జనవరి 21వ తేదీ వరకు ఈ పూజలు కొనసాగనున్నట్లు ఆయన చెప్పారు. రామ్ లల్లా విగ్రహాన్ని గర్బగుడిలో పెట్టినా.. ఇంకా ఆ విగ్రహాన్ని ప్రతిష్టించలేదని పూజారి తెలిపారు. టెక్నికల్ సమస్య వచ్చిందని, ఇంజినీర్లు దీని గురించి ఆలోచిస్తున్నారని పూజారి అర్జున్ దీక్షిత్ వెల్లడించారు. జలాదివస్ పండుగ నేపథ్యంలో ఇవాళ రామ్ లల్లా విగ్రహాన్ని నీటితో శుద్ధి చేయనున్నట్లు చెప్పారు. ఆ తర్వాత గణేశ్, వరుణ పూజలు నిర్వహించనున్నారు.
పూజలు నిర్వహించేందుకు 121 మంది పూజారులను నియమించినట్లు తెలిపారు. ఆలయ పరిసరాల్లో వాస్తూ పూజ కూడా చేపట్టనున్నారు. జనవరి 22వ తేదీన మధ్యాహ్నం 12.20 నిమిషాలకు ప్రాణ ప్రతిష్ట జరగనున్నది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఆ కార్యక్రమం జరిగే అవకాశాలు ఉన్నాయి.