బెంగళూరు: ఆది పూజలు అందుకునే గణనాథుడిపై (Ganapati) కొందరు భక్తులు వినూత్న రీతిలో తమ భక్తిని చాటుకుంటున్నారు. తమ గణేశుడు వినూత్నంగా ఉండేలా చూసుకునేవారు కొందరైతే.. వినాయక మండపాన్ని సరికొత్తగా అలంకరించుకునే వాళ్లు (Ganesh Chaturthi) మరికొందరుంటారు. ఈ రెండో కేటగిరీలోకే వస్తారు కర్ణాటక రాజధాని బెంగళూరులోని (Bengaluru) శ్రీ సత్య గణపతి ఆలయ (Sri Sathya Ganapathy Temple) నిర్వాహకులు. తమ ఆలయంలో గణేశుడి నవరాత్రులను నిత్యనూతనంగా నిర్వహిస్తూ ఉంటారు. ఏటా కొత్తదనాన్ని చూపించే నిర్వాహకులు.. ఈ ఏడాదీ తమ ప్రత్యేకతను చాటుకున్నారు.
ఆలయాన్ని వందల కొద్ది నాణేలు, కరెన్సీ నోట్లతో (Currency notes) అలంకరించారు. వాటి విలువ ఎంతో తెలుసా ఏకంగా రూ.65 లక్షలు. అందులో రూ.10 నుంచి రూ.500 వరకు నోట్లు ఉన్నాయి. వివిధ ఆకృతుల్లో ప్రత్యేకంగా ఆలయాన్ని ప్రత్యేకంగా డిజైన్ చేశారు. గత కొన్నేండ్లుగా గణేశ్ నవరాత్రులకు ఆలయాన్ని పర్యావరణ హితంగా అలంకరిస్తూ వస్తున్నారు. ఈ సందర్భంగా పూలు, మొక్కజొన్న, అరటి కాయల, వివిధ రకాల పండ్లను ఉపయోగిస్తున్నారు. ఈసారీ అదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఆలయ అలంకరణకు కరెన్సీ నోట్లను వినియోగించడం విశేషం.