హైదరాబాద్: పెట్రో బాదుడు కొనసాగుతున్నది. గత కొన్నిరోజులుగా పెట్రోలు, డీజిల్ ధరలు క్రమం తప్పకుండా పెరుగుతున్నాయి. శనివారం పెట్రోల్పై 35 పైసలు, డీజిల్పై 35 పైసల చొప్పున పెంచిన చమురు కంపెనీలు.. వరుసగా నాలుగో రోజూ వినియోగదారులపై మరో 35 పైసలు వడ్డించాయి. దీంతో న్యూఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.105.84కి పెరుగగా, డీజిల్ ధర రూ.94.57కు చేరింది. ఇక ముంబైలో 111.77కి, డీజిల్ ధర రూ.102.52కు పెరిగాయి. కోల్కతాలో పెట్రోల్ రూ.106.3, డీజిల్ రూ.97.68, చెన్నైలో పెట్రోల్ రూ.103.01, డీజిల్ రూ.98.92 చేరాయి.
తాజాపెంపుతో హైదరాబాద్లో పెట్రోల్ రూ.110.09, డీజిల్ రూ.103.18, బెంగళూరులో పెట్రోల్ రూ.109.53, డీజిల్ రూ.100.37కు పెరిగింది. కాగా, ఈ నెలలో లీటర్ పెట్రోల్ రేటు రూ.4.43, డీజిల్ రేటు రూ.5.11లు అధికమయింది.