న్యూఢిల్లీ: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా రెండో రోజూ పెరిగాయి. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల నేపథ్యంలో నాలుగు నెలలపాటు విరామం ఇచ్చిన దేశీయ చమురు కంపెనీలు మంగళవారం నుంచి ధరల పెంపుదలను ప్రారంభించాయి. తాజాగా లీటరు పెట్రోల్పై 90 పైసలు, డీజిల్పై 87 పైసలు పెంచాయి. దీంతో హైదరాబాద్లో లీటరు పెట్రోలు ధర రూ.110, డీజిల్ ధర రూ.96.36కు చేరింది. నిన్న పెట్రోలు రూ.109.10, డీజిల్ రూ.95.50గా ఉన్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్లోని గుంటూరులో పెట్రోల్ రూ.112.80, డీజిల్ రూ.98.10, విజయవాడలో పెట్రోల్ రూ.111.88, డీజిల్ రూ.97.90కి చేరాయి.
ఇక దేశరాజధాని న్యూఢిల్లీలో 80 పైసల చొప్పున పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. దీంతో పెట్రోల్ రూ.97.01, డీజిల్ 88.27గా ఉన్నాయి. ముంబైలో 85 పైసల చొప్పున పెరగడంతో పెట్రోల్ రూ.111.67, డీజిల్ రూ.88.27, చెన్నైలో 75 పైసలు, 76 పైసలు అధికమవడంతో పెట్రోల్ రూ.102.91, డీజిల్ రూ.92.95కు చేరాయి. అదేవిధంగా కోల్కతాలో పెట్రోల్ రూ.106.34 (83 పైసలు), డీజిల్ రూ.91.42 (80 పైసలు)గా ఉన్నాయి.
కాగా, మంగళవారం.. గ్యాస్ సిలిండర్ ధరలు కూడా పెరిగిన విషయం తెలిసింది. గతంలో కంటే రూ.50 అధికమవడంతో హైదరాబాద్లో 14 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధర రూ.1002కు చేరింది.