నేషనల్ డెస్క్:దేశంలో ఇంధన ధరలు మండిపోతున్నాయి. ప్రధాన నగరాల్లో లీటరు పెట్రోల్, డీజిల్ ధర ఎప్పుడో వంద దాటిపోయింది. కేంద్రప్రభుత్వ వైఖరి, స్వలబ్ధి, ఏకపక్ష నిర్ణయాల వల్లే ఈ ధరాఘాతమని సామాన్యులకు కూడా అర్థమయ్యింది. అయితే ఇవేమీ పట్టని కేంద్రప్రభుత్వ పెద్దలు పూటకోమాట మాట్లాడుతూ.. ధరల పెరుగుదలకు అసందర్భ కారణాలను చెబుతున్నారు. పెట్రో ధరల పెరుగుదలపై గడిచిన తొమ్మిది నెలల్లో బీజేపీ నాయకులు చెప్పిన సమర్థనలు ఏమిటంటే..
(18 ఫిబ్రవరి, 2021) గత ప్రభుత్వం వల్లే
ఇంధన దిగుమతులను తగ్గించుకోవడానికి గత యూపీఏ సర్కారు ప్రాధాన్యం ఇచ్చినట్లయితే, ప్రస్తుతం పెట్రో మంటతో మధ్యతరగతి జీవులపై భారం పడేదికాదు.
(22 ఫిబ్రవరి, 2021) సంక్షేమ పథకాలు నడుపొద్దా?
అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు పెరుగడం వల్లే దేశీయ రిటైల్ మార్కెట్లో పెట్రో ధరలు మండిపోతున్నాయి. కరోనా కారణంగా చమురు ఉత్పత్తి, సరఫరా తగ్గిపోయింది.
(14 జూన్, 2021)
కరోనా వ్యాక్సిన్కు ఏడాదికి కేంద్రం రూ. 35 వేల కోట్లు, ఉచిత ఆహార ధాన్యం పథకానికి రూ. లక్ష కోట్లు కేటాయించింది. సంక్షేమ పథకాలను నడుపొద్దా?
(03 జూన్, 2021)
గత కాంగ్రెస్ ప్రభుత్వం కారణంగానే చమురు ధరలు విపరీతంగా పెరిగాయి. ఆ పార్టీ హయంలోని ఆయిల్ బాండ్ల బకాయిలను బీజేపీ చెల్లిస్తూనే ఉన్నది. దీంతో ధరల కట్టడి కష్టమవుతున్నది.
-ధర్మేంద్ర ప్రధాన్, పెట్రోలియం మాజీమంత్రి
(26 ఫిబ్రవరి 2021) ఆ రేషన్ ఎలా వచ్చిందంటే
పెట్రోల్, డీజిల్పై విధిస్తున్న పన్నుల ద్వారా పలు సంక్షేమ పథకాలను నిర్వహిస్తున్నాం. కరోనా సమయంలో పేదలకు ఇచ్చిన ఉచిత రేషన్ నిధుల్ని కూడా దీని ద్వారానే సమకూర్చాం.
మళ్లీ పెట్రో వడ్డింపు
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగి రికార్డుస్థాయికి చేరుకున్నాయి. లీటరు పెట్రోల్, డీజిల్పై 35 పైసల చొప్పున పెంచుతూ చమురు కంపెనీలు గురువారం నిర్ణయం తీసుకున్నాయి. తాజా పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోలు రూ. 104.79, లీటరు డీజిల్ రూ. 93.52కు చేరుకున్నది. ముంబైలో లీటరు పెట్రోలు ధర రూ. 110.75గా ఉండగా, లీటరు డీజిల్ ధర రూ. 101.40కు చేరింది. గడిచిన రెండు వారాల్లో పెట్రోల్ ధరలను 13సార్లు పెంచగా, గడిచిన మూడు వారాల్లో డీజిల్ ధరలను 16సార్లు పెంచారు.
(20 ఫిబ్రవరి, 2021) ధర్మ సంకటమే
పెట్రో ధరల పెరుగుదల కేంద్రప్రభుత్వానికి ‘ధర్మసంకట (పెద్ద సందిగ్ధత)’ పరిస్థితిగా మారింది. చమురు ధరలను తగ్గించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాల్సిన అవసరమున్నది.
(05 మార్చి, 2021)
పెట్రోల్, డీజిల్ భారం వినియోగదారులపై ఎక్కువగా పడుతున్నది. కేంద్రం, రాష్ర్టాలు చమురుపై విధిస్తున్న పన్నులను తగ్గించాలి.
(16 ఆగస్టు, 2021) కాంగ్రెస్ హయాంలోని ఆయిల్బాండ్ల బకాయిలు లేకపోతే, పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకాన్ని ఎప్పుడో తగ్గించేవాళ్లం.
-నిర్మల, కేంద్ర ఆర్థిక మంత్రి
(సెప్టెంబర్ 5, 2021) తాలిబన్ల వల్లే పెట్రోమంట
దేశంలో వంటగ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగడానికి అఫ్గానిస్థాన్ పరిణామాలే కారణం. అఫ్గాన్ను తాలిబన్లు హస్తగతం చేసుకోవడంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరాలో సమస్యలు తలెత్తాయి. తక్కువ ధరకు పెట్రోల్ కావాలంటే అఫ్గాన్కు వెళ్లండి.
-అరవింద్ బెల్లాడ్, బీజేపీ ఎమ్మెల్యే
(అక్టోబర్ 11, 2021) టీకాలు ఉచితంగా వేయట్లేదా?
కరోనా టీకాలను ఉచితంగా పంపిణీ చేయడమే పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు కారణం. పన్నులు వేయకపోతే టీకాలకు డబ్బెక్కడిది. హిమాలయా నీళ్లతో పోల్చితే పెట్రోల్ ధర తక్కువే.
-రామేశ్వర్ తెలి,
పెట్రోలియం శాఖ సహాయ మంత్రి
(జూలై 20, 2021) మౌలిక సదుపాయాల కల్పనకే
మౌలిక సదుపాయాలు, అభివృద్ధి ప్రాజెక్టులకే ఇంధన ధరలను పెంచుతున్నాం.
-పంకజ్ చౌదరి,కేంద్ర సహాయమంత్రి