crude oil| న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు భారీగా తగ్గినా.. కేంద్ర ప్రభుత్వం మాత్రం ఇంధన ధరలను తగ్గించడం లేదు. క్రూడాయిల్ రేట్లు పెరిగినప్పుడు పెట్రోల్, డీజిల్ రేట్లను భారీగా పెంచి సొమ్ము చేసుకున్న మోదీ సర్కారు.. ఇప్పుడు క్రూడాయిల్ రేట్లు తగ్గినా ఆ ప్రయోజనాన్ని సామాన్యుడికి దక్కనీయడం లేదు. అంతర్జాతీయ రేట్లను అనుసరించి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు దేశీయంగా ఇంధన ధరలను సవరిస్తాయని, 2022 జూన్ నుంచి పెట్రోల్, డీజిల్ రేట్లు యథాతథంగా ఉన్నట్టు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్పురి తాజాగా పార్లమెంట్లో పేర్కొన్నారు. అయితే 2022 జూన్ నుంచి క్రూడాయిల్ రేట్లు ఏకంగా మూడింట ఒక వంతు తగ్గాయి. అయినా దేశీయంగా పెట్రో ధరలు ఒక్క రూపాయి కూడా తగ్గలేదు. దీనిపై మాత్రం కేంద్ర మంత్రి ఎలాంటి వివరణ ఇవ్వలేదు.
అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు తగ్గితే, దేశీయంగా పెట్రో ధరలు తగ్గుతాయి. కానీ కేంద్ర ప్రభుత్వం ఇంధన ధరలను తగ్గించకపోకపోగా పెంచుకుంటూ పోయింది. 2015-17 మధ్య క్రూడాయిల్ ధరలు 45-47 డాలర్ల మధ్యనే ఉన్నాయి. ఈ సమయంలో కేంద్రం ఎక్సైజ్ డ్యూటీని పెట్రోల్పై 22.9 శాతం, డీజిల్పై ఏకంగా 68.47 శాతం పెంచింది. 2020లో క్రూడాయిల్ ధరలు ఏకంగా 20 డాలర్లకు పడిపోయాయి. కరోనా కారణంగా అంతర్జాతీయంగా డిమాండ్ తగ్గడంతో ఈ పరిస్థితి వచ్చింది. అయితే కేంద్రం ఆ మేరకు ధరలు తగ్గించకపోగా భారీగా పెంచుకుంటూ పోయింది. 2020 మార్చి 30న పెట్రోల్పై ఎక్సైజ్ డ్యూటీ రూ.19.98గా ఉండగా, 2021 ఫిబ్రవరి నాటికి రూ.32.90కి పెంచింది. డీజిల్పై ఎక్సైజ్ డ్యూటీ రూ.15.83 నుంచి రూ.31.80కి పెంచింది.
ఏడాది బ్యారెల్ ముడిచమురు ధర పెట్రోల్ రేటు
2013 110 డాలర్లు రూ.76
2023 65 డాలర్లు రూ.109