నమస్తే తెలంగాణ నెట్వర్క్, ఆగస్టు 11: 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన స్వతంత్ర భారత వజ్రోత్సవాలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. నాలుగో రోజు గురువారం చేపట్టిన ఫ్రీడమ్ రన్లో భాగంగా ప్రజలు, ప్రజాప్రతినిధులు మువ్వన్నెల జెండాలను చేతపట్టుకొని పరుగులు తీశారు.
దేశ బానిస సంకెళ్లు తొలగించేందుకు పోరాడిన త్యాగధనులను స్మరించుకొన్నారు. ఆయా జిల్లాల్లో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్రావు, సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, వీ శ్రీనివాస్గౌడ్, గంగుల కమలాకర్, అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, సత్యవతి రాథోడ్ ఫ్రీడమ్ రన్లో పాల్గొన్నారు.