న్యూఢిల్లీ : దైవ దర్శనానికి వెళ్లి వస్తూ ఓ కుటుంబం రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా, ఇద్దరు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను గురుగ్రామ్లోని బుధేడాలోని ఎస్జీటీ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన కుండ్లీ – మనేసర్ – పల్వాల్ ఎక్స్ప్రెస్ హైవేపై జరిగింది. మృతుల్లో ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన వారు కాగా.. మరొకరు బంధువు. వీరంతా వైష్ణోదేవి దర్శనం చేసుకొని తిరిగి వస్తున్న సమయంలో ప్రమాదం చోటు చేసుకున్నది. బాద్షా పోలీస్ పోస్టు పరిధిలోని కేఎంపీలో గురువారం ఘటన చోటు చేసుకున్నది.
రోడ్డుపై ఓ వాహనాన్ని పార్క్చేయగా.. వెనుక నుంచి వచ్చిన ఎస్యూవీ ఢీకొట్టింది. రేవారి జిల్లాకు చెందిన ముగ్గురితో పాటు రాజస్థాన్కు చెందిన ఒకరు మృతి చెందారు. మృతుల్లో తల్లి, కొడుకు, కోడలు, అత్తలు ఉన్నారు. ప్రమాదంలో ఇద్దరు గాయపడగా.. వారిని ఎస్జీటీ ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతున్నారు. మృతులు జమ్మూలోని శ్రీమాతా వైష్ణోదేవిని దర్శించుకొని రెండు వేర్వేరు కార్లలో తిరిగి వస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఏఎస్పీ అమిత్ యశ్వర్ధన్ సంఘటనా స్థలానికి సందర్శించి, బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు.