హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం బ్లాక్ ఫంగస్ కట్టడికి పూర్తిస్థాయి చర్యలు తీసుకొని మరణాలను నివారించగలిగిందని కేంద్రం తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా బ్లాక్ ఫంగస్తో చనిపోయింది నలుగురు మాత్రమేనని వెల్లడించింది. కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ సహాయమంత్రి భారతీ పవార్ రాజ్యసభలో నిన్న బ్లాక్ ఫంగస్పై ఓ సభ్యుడు అడిగిన లిఖితపూర్వక ప్రశ్నకు సమాధానమిస్తూ ఈ విషయం వెల్లడించారు. బ్లాక్ ఫంగస్తో దేశవ్యాప్తంగా 4,332 మంది మరణించారని తెలిపారు. తెలంగాణలో 2,538 మంది ఈ ఫంగస్ బారినపడగా కేవలం నలుగురు మాత్రమే చనిపోయినట్టు వివరించారు. కరోనాతో మరణించిన వారిలో చాలామందికి ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు ఆయన తెలిపారు.