Madhya Pradesh | భోపాల్ : మధ్యప్రదేశ్లోని ఇండోర్( Indore )లో విషాదం నెలకొంది. శ్రీరామ నవమి( Sri Rama Navami ) వేడుకలను పురస్కరించుకొని పటేల్ నగర్ ప్రాంతంలోని శ్రీ బాలేశ్వర మహదేవ్ జులేలాల్ ఆలయానికి ( Shree Beleshwar Mahadev Jhulelal Temple ) భక్తులు భారీగా తరలివచ్చారు.
అయితే ఆలయ ఆవరణలో ఉన్న ఓ మెట్ల బావి( Step Well ) నిరూపయోగంగా ఉండటంతో.. దానిపై స్లాబ్ వేసి గదిగా వాడుకుంటున్నారు. ఆ స్లాబ్పై భక్తులు( Devotees ) అధిక సంఖ్యలో నిలబడటంతో కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో 8 మంది భక్తులు మృతి చెందగా, మరో 17 మంది గాయపడ్డారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు( Police ) సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ వారిని సమీప ఆస్పత్రికి తరలించారు పోలీసులు. మృతుల కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.
#UPDATE | Madhya Pradesh: Four people dead while 19 people have been rescued so far after a stepwell collapsed at Indore temple: Indore Police officials https://t.co/ZepjNnYL5J
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) March 30, 2023