Accident | కర్ణాటకలోని చిక్బళ్లాపూర్ వద్ద శుక్రవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. హైదరాబాద్ – బెంగళూరు జాతీయ రహదారిపై వేగంగా వెళ్తున్న ఓ కారు అదుపుతప్పి ఆమని గోపాలకృష్ణ చెరువులో పడిపోయింది. ఈ ప్రమాదంలో నలుగురు యువకులు దుర్మరణం చెందారు.
ప్రమాదం గురించి సమాచారం అందుకున్న చిక్బళ్లాపూర్ పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు. మృతులను రేవా కాలేజీ విద్యార్థులుగా గుర్తించారు. ఘటనకు సంబంధించి మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.