అమృత్సర్: పంజాబ్లో దారుణం జరిగింది. సుఖ్వీందర్సింగ్ సోనీ అనే ఒక వ్యక్తి.. గురుదాస్పూర్లో ఓ కుటుంబంలోని ఆరుగురు వ్యక్తులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందగా, మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడి కోసం పలు బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చేపట్టారు. అయితే, ఘటనకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని గురుదాస్పూర్ డీఎస్పీ తెలిపారు.
పేక మేడలా కూలి నదిలో మునిగిన ఇల్లు.. వీడియో
నీటి కోసం కోటి తిప్పలు.. బిందెడు నీళ్ల కోసం గంటలు పడిగాపులు..!