న్యూఢిల్లీ: దేశ రాజధాని ఘోర ప్రమాదం జరిగింది. ఢిల్లీలోని ఓ ఇంట్లో సిలిండర్ పేలింది. దీంతో నలుగురు మృతిచెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. రాజధానిలో షాహ్దారా ప్రాంతం ఫార్ష బజార్లో ఉన్న ఓ ఇంట్లో మంగళవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత సిలిండర్ పేలిపోయింది. దీంతో ఇంట్లో ఉన్న నలుగురు అక్కడికక్కడే మరణించగా, మరో వ్యక్తి గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రుడిని దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.