కోల్కతా, జూలై 29: పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్య(79) తీవ్ర అస్వస్థతతో శనివారం కోల్కతాలోని ఓ ప్రైవేటు దవాఖానలో చేరారు. శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తడంతో కుటుంబసభ్యులు ఆయ న్ను హుటాహుటిన హాస్పిటల్కు తరలించారు. సీనియర్ వైద్యుల బృందం భట్టాచార్యకు ఐసీయూ వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నదని అధికారులు తెలిపారు.
‘మధ్యాహ్నం సమయంలో ఆయన ఆక్సిజన్ స్థాయి 70 శాతానికి పడిపోయింది. తర్వాత ఆపస్మారక స్థితిలోకి వెళ్లారు. అనంతరం దవాఖానకు తీసుకెళ్లారు’ అని తెలిపారు. 2000 నుంచి 2011 వరకు పశ్చిమ బెంగాల్ సీఎంగా భట్టాచార్య పనిచేశారు.