డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ మాజీ సీఎం, కాంగ్రెస్ నేత హరీష్ రావత్కు కరోనా సోకింది. ఆయనతోపాటు నలుగురు కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్గా బుధవారం నిర్ధారణ అయ్యింది. ఉత్తరాఖండ్ కొత్త సీఎం తీరత్ సింగ్ రావత్ కూడా కరోనా బారినపడ్డారు. మరోవైపు రాష్ట్రంలోని హరిద్వార్లో కుంభమేళా జరుగనుండటంతో కరోనాపై ఉత్తరాఖండ్ హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. రాష్ట్రం, కేంద్రం మార్గదర్శకాలను భక్తులు పాటించాలని, 72 గంటలు మించని ఆర్టీ-పీసీఆర్ నెగిటివ్ రిపోర్టు తప్పనిసరి అని బుధవారం స్పష్టం చేసింది.
ఇటీవల సీఎం పదవి నుంచి దిగిన త్రివేంద్ర సింగ్ రావత్ ఆర్టీ-పీసీఆర్ పరీక్ష రిపోర్ట్ తప్పనిసరి అని కుంభమేళాలో పాల్గొనే భక్తులకు సూచించారు. అయితే ఆయన స్థానంలో సీఎంగా బాధ్యతలు చేపట్టిన తీరత్ సింగ్ రావత్ ఇది అవసరం లేదనన్నారు. ఈ నేపథ్యంలో ఆర్టీ-పీసీఆర్ పరీక్ష రిపోర్టు తప్పనిసరి హైకోర్టు పేర్కొంది. మరోవైపు రాష్ట్రంలో లాక్డౌన్ పరిస్థితులు లేవని ఆ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓం ప్రకాశ్ తెలిపారు. తాను మూడు రోజులపాటు హరిద్వార్లో ఉండి పరిస్థితిని సమీక్షిస్తానని చెప్పారు.