హైదరాబాద్ నగర శివారు ప్రాంతాలన్నీ అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ముందుకెళ్తున్న సమయంలో అధికారులంతా సమష్టి కృషితో ముందుండి.. భవిష్యత్తరాలకు ఆదర్శంగా నిలిచేలా పరిపాలనను అందించాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ సూచించారు. మంగళవారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం స్థాయి నిజాంపేట్ కార్పొరేషన్, కొంపల్లి, దుండిగల్ మున్సిపాలిటీలతో పాటు జంట సర్కిళ్ల అన్ని శాఖల ఉన్నతాధికారులు, చైర్మన్లు, కార్పొరేటర్లతో కొంపల్లిలో జీబీఆర్ గార్డెన్లో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్, పురపాలక శాఖమంత్రి కేటీఆర్ ముందుచూపుతో నగర శివారు ప్రాంతాలను రూ.మూడు వేల కోట్లతో అభివృద్ధి చేసేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.
ఈ నేపథ్యంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలో రోడ్లు, విద్యుత్, తాగునీరు, పరిశుభ్రత, డ్రైనేజీ, నాలాల మరమ్మతులు, వరదనీరు, ముంపు, ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్, సిగ్నల్ జంక్షన్లు, విద్య, వైద్యం, ప్రభుత్వ స్థలాల సమస్యలు వంటి అనేక అంశాలపై చర్చించారు. 2050 వరకు జనాభా పెరుగుదలను దృష్టిలో పెట్టుకొని ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధికి బాటలు పడుతున్నాయని తెలిపారు. దీనిలో భాగంగానే అన్ని శాఖల అధికారులు సమన్వయంతో సమస్యలను పరిష్కరిస్తూ.. అభివృద్ధికి బాటలు వేసేలా ముందుకుసాగాలని పిలుపునిచ్చారు. మరో పది రోజుల్లో అన్ని శాఖల అధికారులు తమ పరిధిలో ఉన్న సమస్యలు, ఇతర అంశాలపై నివేదికలను తయారు చేయాలని సూచించారు.
చింతల్ డివిజన్ పరిధి ఎన్ఎల్బీనగర్లో అభివృద్ధి పనుల కోసం నిధులు మంజూరు చేయాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ను స్థానిక సంక్షేమ సంఘం సభ్యులు కోరారు. మంగళవారం ఎమ్మెల్యేను నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిసిన అనంతరం వారు మాట్లాడుతూ.. కాలనీకి ఆనుకుని ఉన్న హెచ్ఎంటీ సరిహద్దులో ప్రహరీ నిర్మించాలని, మిగిలి ఉన్న సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. స్పందించిన ఎమ్మెల్యే.. సంబంధిత అధికారులకు ఫోన్లో మాట్లాడగా రూ.45 లక్షలు మంజూరయ్యాయని చెప్పారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా త్వరితగతిన ఆయా పనులను పూర్తి చేయాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు వెంకటేశ్గౌడ్, నాయకులు గౌతం, రాచకొండ కుమార్, ప్రభాకర్, చందు తదితరులు పాల్గొన్నారు.
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని ఓం మణికంఠ నాయీబ్రాహ్మణ సేవాసంఘం సభ్యులు మంగళవారం ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ను మర్యాదపూర్వకంగా కలిసి తమ సమస్యలను వివరించారు. గాజులరామారం కైసర్నగర్లో 342 సర్వేనంబర్లో తమకు కేటాయించిన స్థలంలో కమ్యూనిటీ హాల్ను నిర్మించాలని, అర్హులైన నాయీ బ్రాహ్మణులకు డబుల్బెడ్రూం ఇండ్లను మంజూరు చేయాలని, బీసీ ఫెడరేషన్, కార్పొరేషన్ నుంచి అర్హులైన వారికి నిధులు మంజూరయ్యేలా చూడాలని కోరారు. సమస్యలను పరిష్కరించేలా కృషి చేస్తానని హామీ ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు రేనయ్య, కార్యదర్శి పరమేశ్, చైర్మర్ రవి, మైలారం యాదగిరి, సురేశ్, ఆంజనేయులు, సంతోశ్, వెంకటేశ్, జగన్, చంద్రం, సత్యనారాయణ, నరేశ్ తదితరులు పాల్గొన్నారు.
జీడిమెట్ల, ఏప్రిల్ 6 : కార్మికుల సంక్షేమం కోసం కట్టుబడి ఉన్నానని, భవిష్యత్లో ఏ కష్టం వచ్చినా అండగా ఉంటానని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. మంగళవారం రంగారెడ్డినగర్ డివిజన్ గాంధీనగర్ పారిశ్రామికవాడలో ఉన్న రెక్స్ నార్డ్ యూరోప్లెక్స్ ట్రాన్సిమిషన్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ ఎన్నికలు ఈనెల 7న జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో అధ్యక్షుడిగా పోటీ చేస్తున్న ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ కంపెనీ కార్మికులతో జీఆర్ ప్యాలెస్లో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కార్మికుల సంక్షేమం, అభివృద్ధి నిరాటకంగా కొనసాగాలంటే 7న జరిగే యూనియన్ ఎన్నికల్లో చక్రం గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్కేవీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.కిశోర్చారి, కార్మిక సంఘం నాయకులు శ్రీకాంత్, సత్యం, వాసుదేవ నాయుడు, చక్రవర్తి, సుకుమార్, ఫణికుమార్, నర్సింహ, పురుషోత్తం నాయుడు, భాస్కర్, సుమన్కుమార్, లోకేశ్, లక్ష్మీకాంత్, రాజేంద్రప్రసాద్, మల్లికార్జున, శ్రీనివాస్, సత్యనారాయణ, సాయి, రవి, శేఖర్, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.