భోపాల్: లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ (Congress) పార్టీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నారు. సీనియర్ నేతలు ఒక్కొక్కరుగా పార్టీకి హ్యాండిస్తున్నారు. ఇప్పటికే మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్నాథ్ ఊగిసలాటలో ఉండగా.. కేంద్ర మాజీ మంత్రి సురేశ్ పచౌరీ (Suresh Pachouri) బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. శివరాజ్ సింగ్ చౌహాన్ ఆధ్వర్యంలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా శివరాజ్ సింగ్ మాట్లాడుతూ.. మహాత్మాగాంధీ చెప్పినట్లు కాంగ్రెస్ పూర్తిగా అంతమైనప్పుడే రాహుల్ ఊపిరి పీల్చుకుంటాడని ఎద్దేవాచేశారు. నాయకత్వ లేమితో సమతమవుతున్న ఆ పార్టీ నుంచి మంచి నాయకులంతా ఒక్కొక్కరు బయటకు వెళ్తున్నారని చెప్పారు.
గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా ఉన్న పచౌరి.. యూపీఏ ప్రభుత్వంలో రక్షణ శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. అదేవిధంగా నాలుగు పర్యాయాలు రాజ్యసభ్యుడిగా ఎన్నికయ్యారు.