Mahua Moitra | కోల్కతా: ఎన్నికల బాండ్ల ద్వారా అత్యధిక విరాళాలను పొందిన బీజేపీపై టీఎంసీ మాజీ ఎంపీ మహువా మొయిత్రా తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఎన్నికల కమిషన్ గురువారం విడుదల చేసిన వివరాల ప్రకారం ఈ బాండ్ల ద్వారా వివిధ పార్టీలకు లభించిన విరాళాల్లో కేవలం బీజేపీకి సుమారు 48 శాతం సొమ్ము చేరడంతో మహువా ఘాటుగా స్పందించారు.
“ఒక దేశం, ఒక గురువు, ఒక ఈడీ, ఒక ఐటీ, ఒక సీబీఐ, ఒకే రాజకీయ పార్టీ. విరాళాల్లో 55 శాతం. మహా అద్భుతం” అని ఆమె శుక్రవారం ఎక్స్లో వ్యాఖ్యానించారు. మహువా తాను చేసిన ట్వీట్లో బీజేపీకి 55 శాతం విరాళాలు వచ్చాయని పేర్కొన్నారు. కానీ ఆ పార్టీకి సుమారు 48 శాతం వరకు విరాళాలు వచ్చినట్లు ఈసీ విడుదల చేసిన సమాచారం ప్రకారం వెల్లడవుతున్నది.