లక్నో: ఉత్తరప్రదేశ్కు చెందిన గ్యాంగ్స్టర్, రాజకీయ నాయకుడు అతిఖ్ అహ్మద్ (Gangster Atiq Ahmed) ఓ హత్య కేసులో గుజరాత్లోని సాబార్మతి జైలులో (Sabarmati Jail) శిక్ష అనుభవిస్తున్నాడు. అయితే ఉత్తరప్రదేశ్లోని నివాసంలో ఉన్న ఆయన పెంపుడు కుక్క ఆకలి, దప్పులతో చనిపోయింది. మాజీ ఎంపీ అయిన అతిఖ్ అహ్మద్ సోదరుడు ఖలీద్ ఆజిమ్ (Khalid Azim) గత ఎన్నికల్లో అలహాబాద్ (వెస్ట్) నియోజకవర్గం నుంచి పోటీచేశాడు. అయితే ఆయనపై బహుజన్ సమాజ్వాదీ పార్టీ (బీఎస్పీ)కి చెందిన రాజు పాల్ విజయం సాధించాడు. దీంతో అతడిని అతిఖ్ అహ్మద్ హత్య చేశాడు. ఈ కేసులో ప్రస్తుతం అతడు గుజరాత్లోని జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు.
అయితే అతనికి విదేశీ జాతికి చెందిన ఐదు పెంపుడు కుక్కలు ఉన్నాయి. ప్రస్తుతం అవన్నీ యూపీలోని చకియా (Chakia) ప్రాంతంలో ఉన్న అతిఖ్ ఇంట్లోనే ఉన్నాయి. అతడు జైలుపాలవడంతో ఇంట్లో ఉన్న ఆ కుక్కలకు చుట్టుపక్కల వారు తమను శిక్షిస్తారనే భయంతో ఆహారం పెట్టడంలేదు. దీంతో ఆకలి దప్పులతో అవి అలమటిస్తున్నాయి. వాటిలో బ్రౌనో (Bruno) అనే గ్రేట్ డానే జాతికి చెందిన శునకం ఆకలికి తాళలేక చనిపోయింది. మరో నాలుగు కుక్కల పరిస్థితి కూడా అదేవిధంగా ఉన్నది.