Loksabha Elections 2024 : లోక్సభ ఎన్నికలకు ముందు మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ)కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ నేత, మహారాష్ట్ర మాజీ మంత్రి బాబన్రావు ఘోలప్ సీఎం ఏక్నాథ్ షిండే సారధ్యంలోని శివసేనలో చేరారు.
ఇక రానున్న రెండు రోజుల్లో రాజస్ధాన్కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరతారని షిండే వెల్లడించారు. గత నెలలో ఇండిపెండెంట్ ఎమ్మెల్యే రుతు బనవత్ శివసేనలో చేరడంతో ఆ పార్టీ ఉత్తరాదిలో ఉనికి చాటేందుకు సన్నద్ధమవుతోంది. ఇక ఘోలప్ రాష్ట్ర మంత్రి దాదా భుసే, మహారాష్ట్ర శాసనమండలి డిప్యూటీ చైర్పర్సన్ నీలం గోర్హె సమక్షంలో షిండే సేనలో చేరారు.
నాసిక్ జిల్లా నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా వ్యవహరించిన ఘోలప్ షిండే శిబిరంలో చేరడంతో ఉత్తర మహారాష్ట్రలో పార్టీ మరింత బలపడుతుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఇక మాజీ ఎమ్మెల్యే సంజయ్ పవార్ సైతం షిండే సారధ్యంలోని శివసేనలో చేరారు.
Read More :