Basavaraj Bommai : లోక్సభ ఎన్నికలకు ముందు కర్నాటక మాజీ సీఎం బసవరాజ్ బొమ్మై డీఎంకే ఎన్నికల మ్యానిఫెస్టోపై విమర్శలు గుప్పించారు. రాజ్యాంగాన్ని ప్రక్షాళన చేయాలని డీఎంకే కోరుకుంటోందని ఆరోపించారు. డీఎంకే వైఖరిని ఇండియా విపక్ష కూటమి ప్రధాన భాగస్వామి కాంగ్రెస్ సమర్ధిస్తోందా అని బొమ్మై ప్రశ్నించారు.
అసంబద్ధ హామీలను డీఎంకే గుప్పిస్తోందని దుయ్యబట్టారు. ఓ వార్తా ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బసవరాజ్ బొమ్మై ఈ వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం యడియూరప్ప, ఈశ్వరప్పల మధ్య విభేదాలు లేదని ఆయన స్పష్టం చేశారు. మోదీ ప్రభుత్వ పనితీరుతో లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
ఇక రానున్న లోక్సభ ఎన్నికలకు డీఎంకే మేనిఫెస్టోను తమిళనాడు సీఎం స్టాలిన్ బుధవారం విడుదల చేశారు. పుదుచ్చేరికి రాష్ట్ర హోదా, నీట్ పరీక్షల నిషేధం, ముఖ్యమంత్రికి గవర్నర్ను నియమించే అధికారం, చెన్నైలో సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు, రాష్ట్రాలకు సమాఖ్య హక్కులు కల్పించేలా రాజ్యాంగ సవరణ వంటి పలు హామీలను మేనిఫెస్టోలో పొందుపరిచారు.
Read More :
Pawan Kalyan | కాపులే పవన్ కళ్యాణ్ను ఓడించబోతున్నారు.. జనసేన అధినేతపై ద్వారంపూడి సంచలన వ్యాఖ్యలు