Pawan Kalyan | జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై కాకినాడ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. పిఠాపురంలోనూ పవన్ కళ్యాణ్ ఓడిపోవడం ఖాయమని ఆయన అన్నారు. పవన్ కళ్యాణ్పై ప్రజలకే కాదు.. ఆయన సామాజిక వర్గమైన కాపులకే నమ్మకం లేదని విమర్శించారు. ఆయన సామాజిక వర్గం వాళ్లు ఎక్కువగా ఉన్నారనే పిఠాపురం నుంచి పవన్ పోటీ చేస్తున్నారని కామెంట్ చేశారు. కానీ ఆయన సామాజికవర్గం వారికి పవన్ కళ్యాణ్ గురించి చాలా బాగా తెలుసని.. వాళ్లు చాలా తెలివైన వారని అన్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ పవన్ కళ్యాణ్ను వాళ్లు గెలిపించరని అన్నారు. పవన్ కళ్యాణ్ను కాపులే ఓడించబోతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి పోటీ చేయాలంటే చంద్రబాబు అనుమతించాలని.. అదే పార్లమెంటుకు పోటీ చేయాలంటే అమిత్ షా ఓకే చెప్పాలని ద్వారంపూడి అన్నారు. ఏంటి ఈ ఖర్మ.. రాజకీయ పార్టీ అధినేత పోటీ చేసే సీట్ల గురించి కూడా ఎవరో టిక్ పెట్టాల్సిన దౌర్భాగ్యం ఏంటని మండిపడ్డారు. ఎవరొచ్చినా.. ఎవరు పోటీ చేసినా వైసీపీ కేడర్, నాయకులు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు.