న్యూఢిల్లీ: టీమిండియా మాజీ ఓపెనర్, ఢిల్లీ బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) కరోనా బారిన పడ్డారు. తేలికపాటి లక్షణాలు ఉండటంతో పరీక్షలు చేయించుకున్నానని, అందులో పాజిటివ్గా నిర్ధారణ అయిందని గంభీర్ స్వయం వెల్లడించారు. తనను కలిసినవారు పరీక్షలు చేయించుకోవాలని కోరారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
‘నాకు స్వల్ప లక్షణాలు కనిపించడంతో ఈరోజు పరీక్ష చేయించుకున్నా. అందులో కరోనా పాజిటివ్ వచ్చింది. తనను కలిసిన ప్రతి ఒక్కరూ స్వయంగా పరీక్షలు చేయించుకోవాలని అభ్యర్థిస్తున్నాను. స్టే సేఫ్’ అని గంభీర్ తన ట్విటర్ ఖాతలో పోస్టు చేశారు.